Thursday, July 4, 2024
HomeతెలంగాణChevella: సంక్షేమ సంబరాల్లో పట్నం, పైలట్

Chevella: సంక్షేమ సంబరాల్లో పట్నం, పైలట్

స్వయం పాలన లక్ష్యంగా సాగిన తెలంగాణ ప్రభుత్వ ప్రస్థానం రాష్ట్ర సాధనతో చారిత్రత్మకమైన మైలురాయిగా నిలిచింది

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం తాండూరు పట్టణంలోని భవానీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సంక్షేమ సంబరాలకు ముఖ్యాతిథులుగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులని అందజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రతీ గడపకు సంక్షేమన్ని అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. స్వయం పాలన లక్ష్యంగా సాగిన తెలంగాణ ప్రభుత్వ ప్రస్థానం రాష్ట్ర సాధనతో చారిత్రత్మకమైన మైలురాయిగా నిలిచిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలుచేసి వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, యువనాయకులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News