Sunday, July 7, 2024
HomeతెలంగాణChilkuru: చిల్కూరు బాలాజీ సేవలో మంత్రి

Chilkuru: చిల్కూరు బాలాజీ సేవలో మంత్రి

బాలాజీని దర్శించుకున్న మంత్రి సబితా

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం పురస్కరించుకుని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు బాలాజీని దర్శించుకొని స్వామి వారికి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మానవుడు తన దైనందిన జీవితంలో కొంత సమయాన్ని దైవ చింతన కూడా వెచ్చించాలన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని వారు చెప్పారు. వారి వెంట బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంత్ రెడ్డి, ఎంపిపి గునుగుర్తి నక్షత్రం, జెడ్పీటీసీ కాలె శ్రీకాంత్, చిలుకూరు సర్పంచ్ స్వరూప, బిఆర్ఎస్ నాయకులు జయవంత్, బిక్షపతి గౌడ్ స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News