Saturday, October 5, 2024
HomeతెలంగాణChityala: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గుత్తా సందడి

Chityala: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గుత్తా సందడి

చిన్నప్పుడు తాను చదువుకున్న స్కూల్ కి వెళ్లి సందడి చేశారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1969-70 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన తన బాల్య మిత్రులతో కలిసి నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. తన స్వంత గ్రామం అయిన ఉరుమడ్లలో తన స్వగృహంలో తనతో చదివిన సహచరులకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ప్రోగ్రాం ఆయన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి విద్యను నేర్పించిన గురువులను ఘనంగా సన్మానించారు. తమ బ్యాచ్ కు చెందిన ముగ్గురు సోదరులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. శాసన మండలి చైర్మన్ హోదాలో బిజీగా ఉన్నా తమలో ఒకరిగా కలిసిపోయి పేరుపేరునా పరస్పరం అందరి యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకోవడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి సహచరులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News