తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో(CISCO) కీలక ఒప్పందం చేసుకుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సిస్కో బృందం సమావేశమైంది. స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ అందించేందుకు సీఎం సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డితో ప్రీమియర్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పీటర్ మాలినాస్కస్ ఎంపీ బృందం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా హై కమిషనర్ టు ఇండియా ఫిలిప్ గ్రీన్ కూడా పాల్గొన్నారు.
CISCO: తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో కీలక ఒప్పందం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES