Sunday, July 7, 2024
HomeతెలంగాణCM KCR: నిండు మ‌న‌సుతో మొక్కాను.. తెలంగాణ ప్రాప్తిరస్తు అని దీవించారు

CM KCR: నిండు మ‌న‌సుతో మొక్కాను.. తెలంగాణ ప్రాప్తిరస్తు అని దీవించారు

- Advertisement -

CM KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బుధవారం జగిత్యాలలో పర్యటించారు. వాయుమార్గంలో మధ్యాహ్నం 1.31 గంటలకు జగిత్యాల పట్టణానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ కు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులంతా ఘనంగా స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1.42 గంటలకు మొదట నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా కార్యాలయంలో గులాబీ జెండాను ఎగురవేశారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లాశాఖ అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును ఆయన సీట్లో స్వయంగా కూర్చుండబెట్టి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాలలో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం మధ్యాహ్నం 2.04 గంటలకు శంకుస్థాపన చేసి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌ వద్దకు సీఎం కేసీఆర్ చేరుకోగానే అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం 2.21 గంటలకు జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంబర్‌లోని ఉచితాసనంలో కలెక్టర్‌ జి.రవి నాయక్ ను స్వయంగా కూర్చుండబెట్టిన సీఎం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. అనంతరం సాయంత్రం 4.07 గంటలకు సీఎం కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభలో పాల్గొన్నారు.

జ‌గిత్యాల సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం : ముఖ్యాంశాలు
• జ‌గిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకోవడ‌మే కాదు.. ఇవాళ ఒక అద్భుత‌మైన క‌లెక్ట‌రేట్ కూడా నిర్మాణం చేసుకున్నాం.
• ఈ సంద‌ర్భంగా జ‌గిత్యాల జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌, ప్ర‌జ‌ల‌ను హృద‌య‌పూర్వ‌కంగా అభినంద‌లు, శుభాకాంక్ష‌లు.
• క‌ల‌ల‌లో కూడా అనుకోలేదు జగిత్యాల జిల్లాగా అయిత‌దని, బాగా అభివృద్ధి చెందుతుంద‌ని.
• తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ‌ది కాబ‌ట్టి జ‌గిత్యాల జిల్లా ఏర్పాటైందనే విషయాన్ని గుర్తుంచుకోవాలె.
• ఉద్య‌మం జ‌రిగే సంద‌ర్భంలో అత్యంత మ‌హిమాన్విత‌మైన, అద్భుత‌మైన న‌ర‌సింహాస్వామి ధ‌ర్మ‌పురికి వ‌చ్చాను.
• ఆ రోజు ఒక మాట చెప్పాను. గోదావ‌రి న‌ది.. నాటి ఏపీలో తెలంగాణ‌లో మొద‌ట ప్ర‌వేశిస్తే గోదావ‌రి పుష్క‌రాలు ఎందుకు జ‌ర‌ప‌రు? అని సింహాంలా గ‌ర్జించాను.
• దాని మీద చాలామంది చాలా ర‌కాలుగా మాట్లాడారు.
• ధ‌ర్మ‌పురి స్వామి చాలా మ‌హిమాన్విత‌మైన‌ స్వామి.
• స్వామి మీద శేష‌ప్ప క‌వి అద్భుత‌మైన ప‌ద్యాలు రాశారు.
• స్వామి వారిని ద‌ర్శించి నీ ద‌య వ‌ల్ల పుష్క‌రాలు జ‌రుపుదాం అని మొక్కుకున్నాను.
• మ‌ళ్లీ పుష్క‌రాలు వ‌చ్చే లోపు రాష్ట్రాన్ని సాధించి, ఇక్క‌డే పుష్క‌రాలు జ‌రుపుతామ‌ని మొక్కాను.
• నిండు మ‌న‌సుతో మొక్కాను. ధ‌ర్మ‌ప‌త్ని స‌మేతంగా వ‌చ్చి తెలంగాణ ఉద్య‌మం జ‌రిగే స‌మ‌యంలో ధ‌ర్మ‌పురిలో పుష్క‌ర స్నానం చేసి స్వామి వారిని ద‌ర్శించుకున్నాను.
• పండితులు తెలంగాణ ప్రాప్తిర‌స్తు అని దీవెన ఇచ్చారు.
• స్వామి వారి ద‌య, వేదపండితుల ఆశీస్సుల‌తో తెలంగాణ వ‌చ్చింది. అభివృద్ధి చేసుకుంటున్నం.
• తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా పుష్క‌రాలు జ‌రుపుకున్నాం.
• ల‌క్ష‌లాది మంది ధ‌ర్మ‌పురికి త‌ర‌లివ‌చ్చారు.
• మంత్రులు ట్రాఫిక్ పోలీసుల్లా వ్యవ‌హ‌రించి ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా పుష్క‌రాలు నిర్వ‌హించుకున్నాం.
• ఇట్లా చాలా అద్భుతంగా ముందుకు పోతున్నాం.
• తెలంగాణ ఆధ్యాత్మిక ప‌రిమ‌ళాలు ఉన్న ప్రాంతం.
• కాళేశ్వ‌రం, ధ‌ర్మ‌పురి, కొండ‌గ‌ట్టు అంజ‌న్న దేవాల‌యంతో పాటు ప‌లు పుణ్య‌క్షేత్రాలు ఉన్నాయి.
• కొండ‌గ‌ట్టు అంజ‌న్న స‌న్నిధికి హ‌నుమాన్ భ‌క్తులు ల‌క్ష‌ల సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్నారు.
• అంజ‌న్న దేవ‌స్థానం కేవ‌లం 20 ఎక‌రాల్లో మాత్ర‌మే ఉండేది.
• 384 ఎక‌రాల స్థలాన్ని దేవాల‌యానికి ఇచ్చాం. 400 ఎక‌రాల భూమి కొండ‌గ‌ట్టు క్షేత్రంలో ఉంది.
• కొండ‌గ‌ట్టు అంజ‌న్న క్షేత్రం అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నాం.
• త్వ‌ర‌లోనే నేను స్వ‌యంగా వ‌చ్చి ఆగ‌మ‌శాస్త్ర ప్ర‌కారం, భార‌త‌దేశంలో సుప్ర‌సిద్ధ‌మైన‌టువంటి పుణ్య‌క్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News