రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ను తెలంగాణ రాష్ట ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈమేరకు గవర్నర్ ను స్వయంగా కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. రాజ్ భవన్ కు ఈ ఉదయమే వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈమేరకు గవర్నర్ రాధాకృష్ణన్ తో భేటీ అయ్యారు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/06/2e48e6e8-e5ca-4c4e-82b4-d8166f1d52c1-1024x746.jpg)
రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ ను ఆహ్వానించిన సీఎం, డిప్యూటీ సీఎం.