Wednesday, June 18, 2025
HomeతెలంగాణCM Revanth announces Prajapalana for 10 days: సెప్టెంబర్ 17 నుంచి పది...

CM Revanth announces Prajapalana for 10 days: సెప్టెంబర్ 17 నుంచి పది రోజులు ప్రజాపాలన

గోశామహల్ కు ఉస్మానియా ఆసుపత్రి

స్పీడ్ పై సమీక్షలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన విషయాలను చర్చించారు. ఉస్మానియా హాస్పిటల్ ను గోశామహల్ కు తరలించాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి భూ బదలాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని, ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్ట్స్ తో డిజైన్ లను రూపొందించాలని సీఎం ఆదేశించారు.

- Advertisement -

వచ్చే యాభై ఏళ్లను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఈ డిజైన్ లు ఉండేలా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు సీఎం.

గోశామహల్ సిటీ పోలీస్ అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని, సెప్టెంబర్ 17 నుంచి పది రోజులు ప్రజాపాలన చేపట్టనున్నట్టు రేవంత్ తెలిపారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరిస్తామని, పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని ఆదేశించారు సీఎం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News