Tuesday, July 2, 2024
HomeతెలంగాణCM Revanth: బిషప్ తుమ్మబాల పార్ధీవదేహానికి నివాళి అర్పించిన సీఎం

CM Revanth: బిషప్ తుమ్మబాల పార్ధీవదేహానికి నివాళి అర్పించిన సీఎం

సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్ లో..

సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్ లో విశ్రాంత ఆర్చ్ బిషప్ తుమ్మబాల పార్ధీవదేహానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

- Advertisement -

సమాజ నిర్మాణంలో తుమ్మబాల ఎనలేని సేవలు అందించారని, శాంతి, మతసామరస్యం, విద్యను వారు ప్రజలకు అందించారన్నారు. వ్యక్తిగతంగా తుమ్మబాలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని, 2019 ఎంపీ ఎన్నికల్లో, 2023 శాసనసభ ఎన్నికల్లో వారు మమ్మల్ని మంచి మనసుతో ఆశీర్వదించారన్నారు.

వారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ఆయన మరణం వారి అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందన్నారు. వారి సేవలను కొనియాడుతూ.. వారి సందేశం స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News