చింతల గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గోవర్ధన్ రెడ్డి మరణ వార్త తెలియగానే హెలిక్యాప్టర్ లో బయలు దేరి కోస్గి వెళ్లి పుష్పాంజలి ఘటించారు సీఎం. కొడంగల్ నియోజకవర్గం పోతిరెడ్డిపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోతిరెడ్డిపల్లిలో కోస్గి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల గోవర్ధన్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. గోవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు సీఎం.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/07/9bfb46f0-b7a1-4c01-b233-40bfa3acb5f5-1024x683.jpg)