Saturday, July 6, 2024
HomeతెలంగాణCM Revanth Reddy: BRS పార్టీ సచ్చింది

CM Revanth Reddy: BRS పార్టీ సచ్చింది

లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థులకు ఆహ్వానం

అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాలను ఖర్గే, AICCకి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. లోక్ సభలో పోటీకి దరఖాస్తులను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తోందని రేవంత్ తెలిపారు. మార్చ్ 3వ తేదీ వరకు లోక్ సభ సీటు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని, దరఖాస్తుల స్క్రూటినీ కోసం ప్రత్యేక కమిటీ వేశామన్నారు. 17 పార్లమెంట్ సెగ్మెంట్ లకు మంత్రులను, ఇంచార్జీలను నియమించినట్టు, దేశ ప్రజలకి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోడీ విఫలం అయ్యారని రేవంత్ ఆరోపించారు.

- Advertisement -

ప్రపంచంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దేశంగా ఇండియా అవ్వడం మోడీ ఘనతేనని, రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చెయ్యలేదని సీఎం ఆరోపించారు. కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడం బీజేపీ ఘనత సాధించిందని, దేశ ప్రజల మీద వంద లక్షల కోట్ల అప్పులు చేసి మోపారని అన్నారు. మణిపూర్ లో అంతటి ఘటన జరిగితే మోడీ అక్కడికి వెళ్ళలేదని, రాహుల్ గాంధీ లాంటి నాయకుడు దేశానికి ప్రధాని అవ్వడం అవసరమని ఆయన అన్నారు.

తెలంగాణలో BRS పార్టీ సచ్చిందని ఇక ఆ పార్టీకి మనుగడ లేదని, దేశానికి బీజేపీ ప్రమాదకరంగా మారిందని, బీజేపీ BRS ఒక్కటైందని రేవంత్ మరోమారు ఆరోపించారు. బిల్లా – రంగలు అన్నట్లు BJP – BRS వ్యాఖ్యలున్నాయని, BRS కు ఓటు వేస్తే మూసిలో వేసినట్లేనన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే కాంగ్రెస్ హామీలు తెలంగాణలో హామీలు అమలు జరుగుతాయన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు జరగాలి అంటే 17 లోక్ సభ సీట్లు గెలవాలని, మోడీతో కేసీఆర్ చీకటి చర్చలు జరుపుతున్నారన్నారు.

ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెల్లి సభ నుంచి లోక్ సభ శంఖారావం పూరిస్తున్నామని, దేశంలో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటే వాళ్ళ మాటలు పిచ్చి మాటలేనని, రాజకీయ కుట్రతోనే ప్రమాణ స్వీకారం వాయిదా వేసి కుట్రకు తెరలేపారన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రాబోయే ఎన్నికల బరిలో ఉండాలని ఏకగ్రీవ తీర్మానం చేసామని ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు, ఎమ్మెల్యేలు ఎవరు అడిగినా అప్పాయింట్మెంట్ ఇస్తాననని, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు లకు కూడా సమయం ఇస్తనని రేవంత్ అనటం హైలైట్.

బడ్జెట్ లో హామీలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని, ఇరిగేషన్ శాఖపై వచ్చే అసెంబ్లీ సమావేశంలో శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. ఇరిగేషన్ శాఖ పై విజిలెన్స్ మొదలైందని, గద్దర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా జరుపుతోందన్నారు. గత ప్రభుత్వం జరిగిన అవకతవకలపై చట్ట ప్రకారం విచారణ మొదలు పెట్టిందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News