Saturday, April 19, 2025
HomeతెలంగాణRevanth Reddy: టోక్యో నుంచి చాలా నేర్చుకున్నాను: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: టోక్యో నుంచి చాలా నేర్చుకున్నాను: సీఎం రేవంత్ రెడ్డి

జపాన్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ ‌రెడ్డి(Revanth Reddy) టోక్యోలో నిర్వహించిన ఇండియా-జపాన్‌ భాగస్వామ్య రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జపాన్‌లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం సమావేశమైంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జపాన్‌ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానం పలికారు. లైఫ్‌ సైన్సెస్‌, జీసీసీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈవీ, టెక్స్‌టైల్స్‌, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్‌లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

రూ. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌టీటీ డేటా, నెయిసా సంస్థలు సంయుక్తంగా ఈ డేటా సెంటర్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. మరోవైపు రుద్రారంలో రూ.562 కోట్లతో మరో పరిశ్రమ ఏర్పాటుకు తోషిబా ఒప్పందం చేసుకుంది. అలాగే ఫ్యూచర్‌ సిటీ, మూసీ పునరుజ్జీవనం ప్రచార వీడియోలను రేవంత్‌ బృందం ప్రదర్శించింది. హైదరాబాద్‌ అభివృద్ధికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నానని ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. భారత్‌, జపాన్ కలిసి ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్‌ నిర్మిద్దామని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News