టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (V Hanumantha Rao) కలిశారు. విజయవాడలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన వీహెచ్.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై కాసేపు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో ఓ జిల్లాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దళిత సీఎం దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తన ప్రతిపాదన పట్ల చంద్రబాబు సానుకూలంగా స్పందించారని వీహెచ్ తెలిపారు.
- Advertisement -

మరోవైపు మూడు దశాబ్దాల తర్వాత చంద్రబాబు ఇంటికి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెళ్లారు. తను రచించిన “ప్రపంచ చరిత్ర” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి దగ్గుబాటి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
