Thursday, September 19, 2024
HomeతెలంగాణChegunta: దీప్తి విద్యాలయం ప్రిన్సిపల్ కృపవరం 73వ బర్త్ డే

Chegunta: దీప్తి విద్యాలయం ప్రిన్సిపల్ కృపవరం 73వ బర్త్ డే

39 ఏళ్లుగా విద్యా సేవ చేస్తూ..

దీప్తి విద్యాలయం ప్రిన్సిపల్ కృపవరం 73వ జన్మదినోత్సవ సందర్భంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. చేగుంట మండల కేంద్రంలో దీప్తి విద్యాలయం 1984 సంవత్సరంలో శ్రీ కృపవరం స్థాపించారు. చేగుంట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ కృపావరం 39 సంవత్సరాల నుంచి పాఠశాలను నడుపుతూ పదిమందికి ఉపాధి చూపి. వారి దగ్గర చదివిన విద్యార్థులు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలలో వివిధ దేశాలలో స్థిరపడ్డారు. కృపవరం కృషికి, వారు చేస్తున్న విద్యాసేవను పలువురు అభినందించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కృపావరంతోపాటు వారి కూతురు దీప్తి అమర్నాథ్ పద్మశాలి యువ నాయకుడు పుట్ట మహేష్ పద్మశాలి యువనేత మ్యాకల శ్రీనివాస్ జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News