Friday, September 20, 2024
HomeతెలంగాణKidnap : సినీ ఫక్కీలో.. 100 మంది కలిసి యువతిని కిడ్నాప్ చేసిన వైనం.. ఎవరు,...

Kidnap : సినీ ఫక్కీలో.. 100 మంది కలిసి యువతిని కిడ్నాప్ చేసిన వైనం.. ఎవరు, ఎందుకు చేయించారు ?

మిస్టర్ టి టైమ్ ఓనర్ నవీన్ రెడ్డి అనే వ్యక్తి తమ కుమార్తెను కిడ్నాప్ చేయించినట్లు తెలుపగా.. అతడి గురించి పోలీసులు

తెలంగాణలో ఓ యువతిని 100 మందితో కూడిన గ్యాంగ్ కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ముచ్చెర్ల వైశాలి అనే డెంటల్ డాక్టర్ ను రంగారెడ్డి జిల్లా తుర్కయాంజిల్ మునిసిపల్ పరిధిలోని ఆదిభట్లలో ఆమె నివాసం నుండే కిడ్నాప్ చేశారు. ఇంట్లో ఉన్న వస్తువుల్ని పగలగొట్టి.. అడ్డొచ్చిన బంధువుల్ని, చుట్టుపక్కల వారిని, తల్లిదండ్రుల్ని కొట్టిమరీ వైశాలిని ఎత్తుకుపోయారు. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఏసీపీ ఉమామహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని.. యువతి ఆచూకీని కనుగొనేందుకు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు.

- Advertisement -

మిస్టర్ టి టైమ్ ఓనర్ నవీన్ రెడ్డి అనే వ్యక్తి తమ కుమార్తెను కిడ్నాప్ చేయించినట్లు తెలుపగా.. అతడి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. నవీన్..వైశాలిని ప్రేమించాడు. ఈ విషయం తెలిసుకున్న.. వైశాలి తల్లిదండ్రులు ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. పెళ్లిపనులు కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలో నవీన్ రెడ్డి సినిమా స్టైల్లో 100 మంది గ్యాంగ్ తో వైశాలి ఇంటికి వచ్చి.. అడ్డొచ్చిన వాళ్లపై దాడిచేసి ఎత్తుకెళ్లాడు. వైశాలి తనఇష్టానుసారమే వెళ్లిందా లేక బలవంతంగా తీసుకెళ్లారా అన్న విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు.. కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఆమెను ఎటువైపుకు తీసుకెళ్లారో తెలుసుకునేందుకు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News