Friday, September 20, 2024
HomeతెలంగాణLB Nagar: ఆత్మీయ సమ్మేళనంలో సుధీర్ రెడ్డి

LB Nagar: ఆత్మీయ సమ్మేళనంలో సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్ లో ఉధృతంగా దేవిరెడ్డి ప్రచారం

హస్తినపురం డివిజన్ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఈదులకంటి రాంరెడ్డి గార్డెన్స్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేశామని తెలిపారు. అభివృద్ధి విషయంలో ఎల్బి నగర్ ముందంజలో ఉందని, వచ్చే ఎన్నికల్లో ఎల్బి నగర్ నందు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని, నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో పలు కమిటీ, పదవులు ఉన్న ప్రతి ఒక్కరు మన నియోజకవర్గ పరిధిలోని జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అని తెలిపారు.

- Advertisement -

అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గ పరిధిలో వేల కోట్ల రూపాయలతో స్కై,ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసినట్టు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో అత్యధిక పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ మన నియోజకవర్గంలో ఉన్నాయి అని తెలిపారు. అలాగే జీఓ 11 ద్వారా పండ్ల మార్కెట్ ను కోహెడకు తరలించి ఆ ప్రాంతంలో టీమ్స్ హాస్పిటల్ తీసుకువచ్చామన్నారు. 118 జీఓ ద్వారా 18 వేల కుటుంబాలకు లబ్ది చేకూర్చామన్నారు. రాబోయే రోజుల్లో బిఎన్.రెడ్డి నగర్, చంపాపేట్, నాగోల్ నందు ఫ్లై ఓవర్లు వేయిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పద్మ శ్రీనివాస్ నాయక్,సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్ రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సత్యం చారి, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్త శ్రీనివాస్ యాదవ్, పలు కాలనీ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News