Monday, July 8, 2024
HomeతెలంగాణDevireddy: బిఆర్ ఎస్ లో భారీ చేరికలు

Devireddy: బిఆర్ ఎస్ లో భారీ చేరికలు

ఎల్బీ నగర్ లో టీఆర్ఎస్ లో సరికొత్త హుషారు

చంపాపేట్ డివిజన్ పరిధిలోని శుభోదయ కాలనీకు చెందిన ఇతర పార్టీల నాయకులు గోరిగే శ్రీనివాస్ గౌడ్, గోరిగే సురేష్ గౌడ్, లోతుకుంట రఘుపతి గౌడ్, గోరిగే బాబు గౌడ్, వసంత్ కుమార్, విజయ్, కుమార్, ప్రవీణ్, నవీన్ సుమారుగా 200 మంది ఎల్బీ నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సమక్షంలో చేరారు. వారికి సుధీర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చేరిక అయిన వారు మాట్లాడుతూ.. మా మద్దతు సుధీర్ రెడ్డికి తప్పకుండా ఉంటుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సుధీర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గాన్ని సుధీర్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేసారని గుర్తు చేశారు.

- Advertisement -


కేసీఆర్ మేనిఫెస్టో అన్ని వర్గాల వారికి లాభదాయకంగా ఉందని తెలిపారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు స్థానం లేదని తెలిపారు. ఇతర పార్టీల వారి మాటలు నమ్మి మోసపోవొద్దు అని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి పట్టం కట్టాలి అని తెలిపారు. ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే అని తెలిపారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. సంక్షేమ పథకాలు మరోసారి అందుకుందాం. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి, నియోజకవర్గ అభివృద్ధికి మీ యొక్క తోడ్పాటు అందించాలని సుధీర్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ నల్ల రఘుమరెడ్డి, సీనియర్ నాయకులు సుంకోజు కృష్ణమాచారి, డివిజన్ అధ్యక్షులు ముడుపు రాజిరెడ్డి, నాయకులు చీర తిరుమలేశ్, సదానంద రెడ్డి, చేగొని మల్లేష్ గౌడ్, కొయ్యలకొండ సుధాకర్, జగదీష్ గౌడ్, టవర్ శ్రీను, శివ గౌడ్, చందు యాదవ్, అఖిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News