హైదరాబాద్లో మరోసారి మందు పార్టీ(Drug party) కలకలం సృష్టిస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని ఆలివ్ బిస్ట్రో పబ్ లో డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి పక్కా సమాచారం రావడంతో పోలీసులు సోదాలు చేసినట్లు తెలిసింది.
తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్
ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ ఇంట్లో కోడి పందాల పోటీలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన మరువక ముందే హైదరాబాద్లో మరోసారి మందు పార్టీ కలకలం రేపటంతో జూబ్లీ హిల్స్ రోడ్ నెం.45లోని ఆలివ్ బిస్ట్రో పబ్ పై పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ క్రమంలో 20 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్గా తేలిందని పోలీసులు తెలిపారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.