Sunday, October 6, 2024
HomeతెలంగాణEarthquake : పాల్వంచలో స్వల్ప భూ ప్రకంపనలు

Earthquake : పాల్వంచలో స్వల్ప భూ ప్రకంపనలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూమి స్వల్పంగా కంపించడంతో పాటు శబ్దాలు కూడా రావడంతో ప్రజలు ఇళ్లను వదిలి పరుగులు తీశారు. ఈ భూ ప్రకంపనలకు ఇంట్లోని వస్తువులు కూడా కిందపడిపోయినట్టు స్థానికులు వెల్లడించారు. ఈ మధ్యాహ్నం 2.13 గంటల సమయంలో ఒక్కసారిగా భూకంపం రావడంతో పాల్వంచలో భయాందోళన పరిస్థితి నెలకొంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.2 గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News