Sunday, September 8, 2024
HomeతెలంగాణEetala Jamuna: వాళ్ల డబ్బు తీసుకుని ఈటలను గెలిపించండి

Eetala Jamuna: వాళ్ల డబ్బు తీసుకుని ఈటలను గెలిపించండి

ఏం జరుగుతోందో అర్థం చేసుకోండి..

కెసిఆర్ పంపిన డబ్బులను తీసుకొని ధర్మం న్యాయం వైపు నిలబడిన ఈటల రాజేందర్ కు నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమునా రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. వీణవంక మండలం భేతిగల్, కనపర్తి, వల్బాపూర్, నర్సింగాపూర్ గ్రామాలలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాలలోని ప్రజలు ఆమెకు మంగళహారతులతో, డప్పుల చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సమావేశాలలో స్థానిక ప్రజలను ఉద్దేశించి ఈటల జమునా రెడ్డి మాట్లాడుతూ…కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలని స్థానిక ప్రజలను కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News