Thursday, April 10, 2025
HomeతెలంగాణEetala: ఈటెల రాజేందర్ ను సన్మానించిన బిజెపి శ్రేణులు

Eetala: ఈటెల రాజేందర్ ను సన్మానించిన బిజెపి శ్రేణులు

భారతీయ జనతా పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన ఈటల రాజేందర్ ను కోల్ బెల్ట్ బిజెపి శ్రేణులు సన్మానించాయి. భారతీయ జనతా పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన ఈటల రాజేందర్ ను శామీర్ పేట లోని ఆయన నివాసంలో కలిసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్బంగా ఈటెల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచందర్, చందుపట్ల సునీల్ రెడ్డి, బిజెపి మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News