Sunday, July 7, 2024
HomeతెలంగాణErrabelli: ప్రమాదవశాత్తు మరణించిన యువకుడి పాడె మోసిన మంత్రి

Errabelli: ప్రమాదవశాత్తు మరణించిన యువకుడి పాడె మోసిన మంత్రి

పాడే మోసి, మనసు ద్రవించి కంట నీరు పెట్టి, బాధిత కుటుంబాన్ని ఓదార్చిన మంత్రి

మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు మూల ఉపాకర్ రెడ్డి కుమారుడు ఉజ్వల్ రెడ్డి అకాల మరణం చెందగా, యువకుడి అంత్యక్రియల్లో పాల్గొని, పాడే మోసి, మనసు ద్రవించింది, కంట నీరు పెట్టిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆ కుటుంబాన్ని ఓదార్చారు.

- Advertisement -

అలాగే మూల ఉపాకర్ రెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపిన మంత్రి, ఆ కుటుంబాన్ని ఓదార్చారు. జరిగిన ఘటన తెలుసుకొను తీవ్ర అవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ నడిపిస్తూ, అదుపు తప్పి, ప్రమాదవశాత్తు అదే ట్రాక్టర్ పై నుండి పడి, ఆ ట్రాక్టర్ ఉజ్వల్ రెడ్డిపై నుండి పోవడంతో మరణించాడు. ఈ ఘటన పూర్వాపరాలు తెలుసుకొని తీవ్రంగా విలపించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఎదిగిన కొడుకు కళ్ళ ముందే రెప్ప పాటులో జరిగిన ప్రమాదంలో తనువు చాలించడం అత్యంత బాధాకరం. ఇలాంటి కడుపు కోత మరెవ్వరికీ రాకూడదు. ఆ తల్లి తండ్రులకు జరిగిన అన్యాయాన్ని, లోటుని మరెవ్వరూ పూడ్చలేము. వారికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అన్నారు. వారికి ధైర్యం చెబుతూ, వారి వెంట నడుస్తూ, ఉజ్వల్ పాడే మోసి, ఆ కుటుంబం, నియోజకవర్గ ప్రజల పట్ల తన అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News