Friday, September 20, 2024
Homeతెలంగాణపోషమ్మ అమ్మ వారు పాలకుర్తి ని కాపాడుతుంది

పోషమ్మ అమ్మ వారు పాలకుర్తి ని కాపాడుతుంది

పోషమ్మ అమ్మ వారు పాలకుర్తి ని కాపాడుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తిలో ఎన్నడూ జరగనంత అభివృద్ది జరిగిందన్న మంత్రి ఎర్రబెల్లి.. అందరికీ సకల శుభాలు జరగాలని కోరుకున్నట్టు తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా పాలకుర్తి, SC కాలనీలలో పోషమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఎర్రబెల్లి.. పోషమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్;

“పోషమ్మ తల్లి బోనాల పండుగకు నేను ప్రతి సారి హాజరు అవుతా….అమ్మ వారి దయ వల్ల మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయి మంత్రిని అయ్యాను. అమ్మ వారి చల్లని చూపుతో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ది జరిగింది. పాలకుర్తికి చారిత్రక, ఉద్యమ, సాహిత్య చరిత్ర వుంది. సమైక్య పాలనలో మన ప్రాంతాన్ని ఎవరు పట్టించుకోలేదు, రాష్ట్రం వచ్చాక సీఎం కేసిఆర్ గారి ఆశీస్సులతో టూరిజం కారిడార్ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే పాలకుర్తి సోమన్న, ఊరి దేవతల ఆశీస్సుల వల్లే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ గారికి మనమంతా రుణపడి ఉండాలి. సీఎం కెసిఆర్ గారిని మరోసారి ఆశీర్వదించాలి”..అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, బోనమెత్తిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News