Friday, September 20, 2024
HomeతెలంగాణErrabelli: ఇంట్లో వంటమనిషి కూతురు పెళ్లి తన ఇంట్లో చేసిన మంత్రి

Errabelli: ఇంట్లో వంటమనిషి కూతురు పెళ్లి తన ఇంట్లో చేసిన మంత్రి

20 ఏళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న మల్లం కోమల కుమార్తె శ్రీలేఖ పెళ్లి తన ఇంట్లో చేసిన మంత్రి ఎర్రబెల్లి

ఎవరైనా… ఇంట్లో పని చేసే వారికి భోజనం పెట్టి నెల నెల జీతం ఇచ్చి, ఏదైనా కష్టం వస్తే సాయం చేస్తాం కానీ, వీరు మాత్రం తమ ఇంట్లో పని చేసే వారిని కుటుంబ సభ్యులకు కూడా తమ ఇంట్లో మనుషులుగా, కుటుంబ సభ్యులుగా గుర్తించి వారి బాగోగులు చూసుకుంటూ… వారి పిల్లల పెండ్లిలు కూడా చేస్తారు. వారు ఎవరో కాదు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు.

- Advertisement -

తమ ఇంట్లో కలిసిపోయి గత 20 ఏళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న మల్లం కోమలకి శ్రీలేఖ అనే పెళ్ళీడు కొచ్చిన కుమార్తె వుండగా వారికి మహబూబాబాద్ జిల్లా, నర్సింహులపేట మండలం, జయపురం గ్రామానికి చెందిన సుధాకర్ తో వివాహం నిశ్చయమైంది. మొదటి నుండి కోమల నిరుపేద కుటుంబ పరిస్థితి తెలిసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు – ఉషా దంపతులకు ఈ విషయం తెలిసింది. వెంటనే ఆమె వివాహ ఖర్చులు భరించడమే కాక తమ స్వగ్రామం పర్వతగిరిలో తమ నివాసంలోనే స్వయంగా తామే ఉండి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పెండ్లి జరిపించి, పెండ్లికి వచ్చి ఆశీర్వదించిన ఇరు కుటుంబాల బంధుమిత్రులకు భోజనాలు ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి అండదండగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు – ఉషా దంపతులు నిలిచారు.

ఈ పెండ్లికి హాజరైన కోమల బంధువులు తమ వంట మనిషి బిడ్డ పెండ్లిని తమ ఇంట్లో పెండ్లిలా జరిపించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులను కొనియాడుతూ ముచ్చటించుకున్నారు . ఈ సందర్భంగా మల్లం కోమల – రాజు దంపతులు తమ బిడ్డ పెండ్లిని జరిపించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులకు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News