Thursday, July 4, 2024
HomeతెలంగాణErrabelli: రక్తంతో గురువు ఫోటో ఆర్ట్ వేయించిన శిష్యుడు

Errabelli: రక్తంతో గురువు ఫోటో ఆర్ట్ వేయించిన శిష్యుడు

శిష్యుడి అభిమానం చూసి ఉప్పొంగిన మంత్రి

తన రక్తంతో ఎర్రబెల్లి దయన్న ఫోటో ఆర్ట్ వేయించి, అభిమానం చాటుకున్నారు మేడారపు సుధాకర్. ఎర్రబెల్లి పుట్టినరోజు సందర్భంగా ఆయన శిష్యుడు మేడారపు చేసిన ఈ పని చాలా అరుదైనదిగా ఎర్రబెల్లి అనుచరులు గొప్పగా చెప్పుకుంటున్నారు.

- Advertisement -

తన రాజకీయ గురువు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదినం తనకు పండుగ రోజుగా భావించి కే.యూ జేఏసీ వైస్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి యువజన నాయకులు డా. మేడారపు సుధాకర్ తన రక్తంతో ఎర్రబెల్లి దయన్న ఫోటో ఆర్ట్ ( బ్లడ్ ఆర్ట్ ) వేయించి అభిమానం చాటుకున్నాడు. ఆ ఆర్ట్ ఫ్రేమ్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు బహూకరించగా ఆ ఫోటో ఫ్రేమ్ ను చూసి తన జన్మదినం సందర్భంగా మరచిపోలేని ఫ్రేమ్ ను ఇచ్చిన తన అభిమాని డా. మేడారపు సుధాకర్ ఆత్మీయతతో ఆలింగనం చేసుకొని అభనందించి, ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News