Sunday, October 6, 2024
HomeతెలంగాణErrabelli: వాళ్లు మీదగ్గరకు వస్తే నిలదీయండి

Errabelli: వాళ్లు మీదగ్గరకు వస్తే నిలదీయండి

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో సందడి చేసిన మంత్రి ఎర్రబెల్లి

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం బమ్మెర, పలుగు బొడు తండా, ఎర్ర గుంట తండా, దుబ్బ తండా, పెద్ద తండా, రాఘవ పురం, గ్రామాలకు కలిపి, పాలకుర్తి శివారులోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

- Advertisement -

ఈ సందర్భంగా బి అర్ ఎస్ పార్టీ ప్రభుత్వం అధ్వర్యంలో, సీఎం కెసిఆర్ నాయకత్వంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు మంత్రి ఎర్రబెల్లి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైఖరిని విమర్శిస్తూ, గ్రామాలకు వస్తే వాళ్ళని నిలదీయాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆయా గ్రామాల నాయకులు, ప్రజా ప్రతినిదులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News