Saturday, April 12, 2025
HomeతెలంగాణErrabelli: తాగు నీటి సమస్యలు రాకూడదంతే

Errabelli: తాగు నీటి సమస్యలు రాకూడదంతే

మిషన్ భగీరథ ఎండా కాలం సన్నద్ధత పై సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్ర గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో సమీక్ష సాగింది.
రానున్న ఎండాకాలం నేపథ్యంలో నిరాటంకంగా నిర్వర్తించాల్సిన మంచినీటి సరఫరాపై మిషన్ భగీరథ అధికారులకు దిశా నిర్దేశం చేశారు మంత్రి. ఎండాకాలం లో నీటి ఎద్దడి ఎక్కడా రాకుండా చూడాలని, అధికారులు సర్వ సన్నద్ధంగా ఉండి, సమన్వయంతో పని చేయాలన్నారు.
అన్ని రిజర్వాయర్లు నిండి ఉండేలా ఇప్పుడే జాగ్రత్త పడాలని, ఎండా కాలంలో కూడా నిర్దేశిత నీటిని ప్రజలకు నాణ్యంగా అందించాలన్నారు ఎర్రబెల్లి. కరెంటు సమస్యలు వచ్చినా, నీటి సరఫరా ఆగరాదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని ఆదేశించారు. ఫిల్టర్ బెడ్లు, ట్యాంకుల క్లీనింగ్ సరిగా చేయాలని, అన్ని స్కూల్స్, అంగన్ వాడీలు, ప్రభుత్వ కార్యాలయాలకు మంచినీరు అందాలన్నారు.
ఈ సారి ఎండలు బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో, నీటి సరఫరాకు ఆటంకాలు లేకుండా, అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News