తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో(Gaddar Awards) భాగంగా స్పెషల్ జ్యూరీ అవార్డులను సీనియర్ నటుడు మురళీమోహన్ ప్రకటించారు. నందమూరి బాలకృష్ణకు(Balakrishna) ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక ప్రముఖ దర్శకులు మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్, దర్శకుడు సుకుమార్కు బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు, యండమూరి వీరేంద్రనాథ్కు రఘుపతి వెంకయ్య అవార్డు, యువ హీరో విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు, అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.
