Friday, September 20, 2024
HomeతెలంగాణGangula: మోడీ గారూ.. బతకనీయండి అంటూ దద్దరిల్లిన కరీంనగర్

Gangula: మోడీ గారూ.. బతకనీయండి అంటూ దద్దరిల్లిన కరీంనగర్

మంత్రి గంగుల కమలాకర్ సారథ్యంలో గ్యాస్ ధరల పెంపు పై ఉద్యమించారు కరీంనగర్ మహిళలు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరకు నిరసనగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈసందర్భంగా..”మోడీ గారూ.. బతకనీయండి” అంటూ మహిళలు నినాదాలు చేయటం విశేషం. స్థానిక మేయర్, జడ్పీ చైర్మన్ తో పాటు పెద్ద సంఖ్యలో సామాన్య ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News