Sunday, October 6, 2024
HomeతెలంగాణGarla: జన నాయకుడికి ఘన నివాళి

Garla: జన నాయకుడికి ఘన నివాళి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు ప్రజా నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతివేడుకలను గార్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తాళ్లపల్లి కృష్ణా గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం గార్ల మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఘనంగా నిర్వహించారు.

- Advertisement -

తొలుత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మాజీ పీసీసీ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావూరి వెంకట్రామయ్య ఓబీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడ్ల అప్పయ్య జడ్పిటిసి జాటోత్ ఝాన్సీ లక్ష్మీబాయి, మాజీ ఎంపీపీ ఎంపీటీసీ సభ్యులు వెంకట్ లాల్ శంషాద్ బేగంలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజు రియంబర్ మెంట్స్ చేసి విద్యార్థులను జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం తో పేద ప్రజల గుండెల్లో స్థాయిగా నిలిచిపోయి గొప్ప నాయకుడని, ఏక కాలంలో రుణమాఫీ చేసి రైతులందరికీ అండగా నిలబడ్డ మహా నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి భౌతికంగా మనతో లేకపోయినా ఆయన చేసిన సేవలు చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని వారన్నారు.

ఈ కార్యక్రమంలో కొణతం సత్యనారాయణ రెడ్డి దీకొండ రాము హథిరం నాయక్ జర్పుల పృధ్వీ రాజ్ , మాజీ సర్పంచ్ రవి , కోల కుమార్ గౌడ్, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షేక్ యాకుబ్ పాష, బాబూలాల్, మాలోత్ భాస్కర్, సర్వేష్ , మహిళా కాంగ్రెస్ అనుముల గంగ , మైనార్టీ నాయకులు మీరా పటాన్ ఖాన్ , రామ్ కుమార్ , గిరి గారు నాయకులు కడియం వెంకన్న ,గులగట్టు బాబు వెంకటేశ్వర్లు, పిల్లలమర్రి వీరస్వామి , మేడేపల్లి దుర్గాప్రసాద్,రాము అస్మత్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News