Friday, September 20, 2024
HomeతెలంగాణGHMC: పారిశుద్ధ్య కార్మికురాలిని సన్మానించిన లచ్చిరెడ్డి

GHMC: పారిశుద్ధ్య కార్మికురాలిని సన్మానించిన లచ్చిరెడ్డి

'బెస్ట్ వర్కర్' అవార్డు పొందిన పారిశుద్ధ్య కార్మికురాలు కొంగర కృష్ణవేణి

సాహెబ్ నగర్ సీతారామాంజనేయ స్వామి కళ్యాణ మండపంలో బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికురాలు కొంగర కృష్ణవేణిని ‘బెస్ట్ వర్కర్’ గా గుర్తించి, శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆయన మాట్లాడుతూ.. ప్రతి కాలనీలో పారిశుద్ధ్య పనులు చేపట్టే సఫాయి అన్న, సఫాయి అమ్మకు సన్మానం చేసి గౌరవించాలని, అలాగే ఎప్పటికప్పుడు కాలనీలో శుభ్రం ఉంచేలా చూసుకునే బాధ్యత పారిశుద్ధ కార్మికులపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అజీమ్ ఉద్దీన్, జవాన్ రామ్ చందర్, డివిజన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రావు, యువ నాయకులు శశి, ఎస్ఎఫ్ఎ గోవర్ధన్ రెడ్డి ప్రకాష్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News