Sunday, July 7, 2024
HomeతెలంగాణGodavarikhani: 23వ డివిజన్లో పర్యటించిన సిపి రెమా రాజేశ్వరి

Godavarikhani: 23వ డివిజన్లో పర్యటించిన సిపి రెమా రాజేశ్వరి

తాజా పరిస్థితులు స్వయంగా తెలుసుకున్న ఆఫీసర్

రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి 23వ డివిజన్ లో పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బి పవర్ హౌస్ బూడిద చెరువు కట్ట తెగి 23వ డివిజన్ మోమిన్ నగర్, సుభాష్ నగర్, ఆటోనగర్ కాలనీ ఇండ్లలోకి భారీగా వరద నీరు చేరుకొంది. దీంతో రామగుండం సి.పి రేమా రా, గోదావరిఖని ఏసిపి శ్రీనివాస్ రావు, రామగుండం సీఐ చంద్రశేఖర్ గౌడ్ లు బి పవర్ హౌస్ యాష్ బూడిద చెరువు కట్ట తెగిన ప్రదేశాన్ని పరిశీలించారు. వరద ప్రభావంపై స్థానిక కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, రామగుండం సిఐ చంద్రశేఖర్ గౌడ్ లను వివరాలు సిపి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News