Friday, September 20, 2024
HomeతెలంగాణGodavarikhani: జనక్ ప్రసాద్ కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలి

Godavarikhani: జనక్ ప్రసాద్ కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలి

సంజీవరెడ్డిని కలిసిన ఐఎన్టియుసి శ్రేణులు

రామగుండం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఐఎన్టీయుసీ నేత జనక్ ప్రసాద్ కు ఇవ్వాలని ఐఎన్టియుసి శ్రేణులు కోరారు. ఈ మేరకు హైదరాబాదులో ఐఎన్టీయూసీ ఆల్ ఇండియా అధ్యక్షులు డా. సంజీవ రెడ్డి నివాసంలో వర్కింగ్ కమిటీ శ్రేణులు కలిశారు. వర్కింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న తీర్మాన పత్రాన్ని సంజీవరెడ్డికి అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కోల్ బెల్ట్ వ్యాప్తంగా జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న తీర్మాన పత్రాన్ని ఐఎన్టియుసి ప్రతి నిధుల బృందం ఆల్ ఇండియా అధ్యక్షులు సంజీవ రెడ్డి నీ వారి నివాసం లో కలిసి వర్కింగ్ కమిటీ లో తీసుకున్న తీర్మాన పత్రాన్ని అందచేసినట్లు పేర్కొన్నారు.
తీర్మానంలో ముఖ్యంగా ఐఎన్టియుసి కోటా లో జనక్ ప్రసాద్ కు రామగుండం నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలని, లేని పక్షంలో కోల్ బెల్ట్ వ్యాప్తంగా 12 నియోజవర్గలలో కాంగ్రెస్ పార్టీ కి ఐఎన్టీయూసీ సంఘం సహాయ నిరాకరణ చేస్తుందని తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.
సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సత్యజిత్ రెడ్డి, చంద్ర శేఖర్, గుమ్మడి కుమార స్వామి, ధర్మపురి, కాంపెళ్ళీ సమయ్య, వడ్డేపల్లి దాస్, రాంశేట్టి నరేందర్, వికాస్ కుమార్ యాదవ్, ఆరేపల్లి శ్రీనివాస్ , మనోహర్, పోచయ్య ,వెంకట స్వామి, దేవి భూమయ్య , జగన్మోహన్ , సాగర్, ఆంజనేయులు , ఏడులాపురం శ్రీనివాస్ , రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News