రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇంటిలో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే చందర్ సోదరీమణులు చందర్ కు రాఖీలు కట్టి ఆశీస్సులందించారు. అలాగే చందర్ కుమార్తె ఉజ్వల సోదరుడు మణిదీప్ కు రాఖీ కట్టి నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అంటూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/dc14acc4-288c-41a3-a18a-cef43f527a5b-1024x576.jpg)
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ రాఖీ పండుగ సందర్భంగా అన్న చెల్లెల్లు, అక్క తమ్ముళ్లు అందరూ రక్షాబంధన్ వేడుకలలో ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. అలాగే రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/91c95a7e-1b9e-4247-8419-9c72b7ab0a26.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/365adaff-2a29-4910-b68b-741c650373dc-1024x576.jpg)