రేపటి నుండి విధుల్లోకి గ్రామ పంచాయతీల ఉద్యోగ, కార్మికులు తిరిగి చేరనున్నట్టు ఉద్యోగ కార్మికుల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శులకు లేఖలు అందజేశారు ఉద్యోగ, కార్మికుల జేఏసీ ప్రతినిధులు. నిన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిల ఆధ్వర్యంలో భేటీ అయిన గ్రామ పంచాయితీల ఉద్యోగ కార్మికుల జేఏసీ ప్రతినిధులు, ఆర్థికపరమైన సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థికేతర అంశాల పరిష్కారానికి ఆశాభావం వ్యక్తం చేసిన జేఏసీ, గత 34 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించి, 9వ తేదీ నుంచి విధుల్లోకి చేరనున్న గ్రామ పంచాయతీల ఉద్యోగ కార్మికులు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/a9cd7ad6-87b9-48b9-be07-856d6435593e-1024x682.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/6c25d4cf-41c6-421d-b7fe-7003ef0b96cc-1024x682.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/587fbbdd-a16a-4921-bc46-f68ea88f8ab1-1024x682.jpg)