Sunday, November 16, 2025
HomeతెలంగాణGroup -1 Rankers’ Parents: రూ. 3 కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో తెలీదు.. నోటి కాడ...

Group -1 Rankers’ Parents: రూ. 3 కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో తెలీదు.. నోటి కాడ ముద్ద ఎత్తగొట్టకండి

Group -1 Rankers’ Parents: తెలంగాణలో గ్రూపు 1 పరీక్షల వివాదం వేడెక్కుతోంది. అభ్యర్థుల తల్లిదండ్రులు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. గ్రూప్‌-1 పోస్టును రూ. 3 కోట్లకు కొన్నారనే ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు. రాజకీయాల కోసం తమ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దని.. పిల్లల భవిష్యత్తు నాశనం చేసి మా నోటికాడి ముద్ద లాగేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

ఇటీవల తెలంగాణలో గ్రూప్ – 1 ఫలితాలను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆన్సర్‌ షీట్స్‌ను మళ్లీ మూల్యాంకనం చేయాలని.. లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ తీర్పుపై డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లాలని TGPSC యోచిస్తోంది. మరోవైపు తమ జీవితాలను ఆగం చేయొద్దంటూ ఎంపికైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీపై రాజకీయాలు చేయొద్దని ఆవేదన వెలిబుచ్చారు. ఈ క్రమంలో అభ్యర్థుల తల్లిదండ్రులు మొదటిసారిగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు.

Also Read: https://teluguprabha.net/telangana-news/ktr-questions-bjp-on-playing-cricket-with-pakistan/

గ్రూప్-1 పోస్టులు ఒక్కొక్కటి రూ. 3 కోట్లకు అమ్ముకున్నారనే ఆరోపణలపై అభ్యర్థుల తల్లిదండ్రులు వాపోయారు. “గ్రూప్‌-1 పోస్టును రూ. 3 కోట్లుకు కొన్నారని మాపై ఆరోపణలు చేస్తున్నారు. మూడు కోట్లకు ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా మాకు తెలియదు. మూడు కోట్లు ఇచ్చి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది. ఏదో వ్యాపారం చేసుకుని బతికేవాళ్లం కదా.. మేమందరం మూడు కోట్ల లంచం ఇచ్చే పరిస్థితిలో ఉన్నామా..? ఒక్కసారి మమ్మల్ని చూసి ఆలోచించండి’ అని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని న్యాయం చేయాలని హైకోర్టును కూడా విన్నవించుకున్నారు. 

తమలో చాలామంది ఒక్కపూట తింటే మరోపూట తినలేని పరిస్థితుల్లో ఉన్నామని.. అలాంటిది రూ. 3 కోట్లు పెట్టి సీట్లు ఎలా కొంటామని వారు ప్రశ్నించారు. గ్రూప్- 1 ఫలితాలపై ఎవరకి నచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. అభ్యర్థుల తల్లిదండ్రులు రూ. 3 కోట్లు పెట్టి పోస్టులు కొన్నారంటున్నారు. మాలో కొందరికి కూటికి కూడా గతి లేదు. కష్టపడి, పస్తులుండి అప్పులు చేసి పిల్లలను చదివించాం.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: https://teluguprabha.net/telangana-news/ed-concludes-interrogation-in-telangana-sheep-distribution-scam/

ఈ ఆరోపణలతో సమాజం తమ పట్ల చిన్న చూపు చూసే అవకాశం ఉందని అభ్యర్థుల తల్లిదండ్రులు వాపోయారు. ఆరోపణలు తిప్పికొట్టకపోతే నిజంగానే తాము తప్పు చేసిన వాళ్ళం అవుతామనే  మీడియా ముందుకు వచ్చామని వెల్లడించారు. ‘రేపు మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా.. రూ. 3 కోట్లు పెట్టి కొనుక్కున్న ఉద్యోగం అని నలుగురూ అనుకునే అవకాశం ఉంది.’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రూప్‌- 1 పరీక్షల ఫలితాలను రాజకీయం చేయొద్దని నిరుద్యోగుల తల్లిదండ్రులు కోరారు. వాస్తవాలను బయటపెట్టాలని కానీ రాజకీయాలు చేసి తమ పిల్లల జీవితాలు నాశనం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరో ఒకరే గెలుస్తారు. అలా అని ఓడిపోయిన నేతలంతా మళ్లీ ఎన్నికలు పెట్టాలని కోర్టుకు వెళ్తారా అని ప్రశ్నించారు.

ఇప్పటికే తమ పిల్లలు చాలా కష్టపడ్డారని.. మళ్లీ పరీక్షలు రాయాలంటే ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుందని తల్లిదండ్రులు వాపోయారు. ‘న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. మళ్లీ మెయిన్స్ పెట్టినా ఆ ఫలితాలు కూడా రద్దు కావని గ్యారెంటీ ఏంటి?. ర్యాంకులు తెచ్చుకుని కూడా మా పిల్లలు రోడ్డున పడినట్లయింది. రాజకీయ ఆరోపణలతో మా పిల్లలు  తలదించుకోవాల్సి వస్తోంది. గ్రూప్-1 ర్యాంకర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. మీ రాజకీయల కోసం మా పిల్లల భవిష్యత్ నాశం చేసి నోటి కాడి ముద్ద ఎత్తగొట్టవద్దు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad