Saturday, October 5, 2024
HomeతెలంగాణSandra: గృహ లక్ష్మి పథకం కింద 3 వేల ఇళ్లు మంజూరు

Sandra: గృహ లక్ష్మి పథకం కింద 3 వేల ఇళ్లు మంజూరు

నియోజకవర్గానికి 3000 ఇళ్లు

గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గానికి 3000 ఇళ్లు మంజూరైనట్టు ఎమ్మెల్యే సండ్ర అన్నారు.
తల్లాడ మండలంలోని కుర్నావల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషిచేస్తున్నట్టు తెలిపారు. కురవల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 25 లక్షలు మంజూరు చేశామన్నారు. కుర్నవల్లి నుండి ఉమ్మడి దేవరపల్లి రోడ్డుకు ఏడు కోట్లు, కుర్నవల్లి నుండి పుణ్యపురం రోడ్డుకు బ్రిడ్జి తో పాటు బీటీ రోడ్డు నిర్మాణానికి మూడు కోట్ల రూపాయలను మంజూరు చేశామన్నారు. అవసరమైనన్ని సీసీ రోడ్డు నిర్మించి కుర్నవల్లి గ్రామాభివృద్ధికి శక్తివంచన లేకుండా చేశామన్నారు.

- Advertisement -

త్వరలో గృహలక్ష్మి పథకం ద్వారా నియోజకవర్గ ప్రజలకు 3000 ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ కాలనీ ప్రజల కోరిక మేరకు శ్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించి అందజేశామన్నారు. ముందుగా ఎస్సీ కాలనీ ప్రజలు ఎమ్మెల్యే సండ్రకు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. పూలదండలు శాలువాలతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News