Sunday, July 7, 2024
HomeతెలంగాణGudem Mahipal Reddy: రామాలయం నిర్మాణానికి 20 లక్షల విరాళం

Gudem Mahipal Reddy: రామాలయం నిర్మాణానికి 20 లక్షల విరాళం

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మండల పరిధిలోని వడక్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న రామాలయానికి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 20 లక్షల విరాళం ప్రకటించారు. పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ 10 లక్షలు, గ్రామ సర్పంచ్ లలితా మల్లేష్ 10 లక్షలు, రియల్టర్ సీసాల రాజు 10 లక్షల విరాళాలు ప్రకటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి రామాలయ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు మహిపాల్ రెడ్డి. ఎంపీపీ దేవానంద్, ప్రజా ప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News