ఏక్తా 86 బృందం వారు నూతనంగా నిర్మిస్తున్న కమిటీ భవనము నిర్మాణ పనులను ఈ రోజు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రారంభించారు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/63c7c914-b93f-498a-bb26-c877cc0525fc-1024x682.jpg)
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ 1986వ సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఏక్తా 86 పేరుతో ఒక బృందంగా కలిసికట్టుగా ఉండడం గొప్ప విషయం అని కొనియాడారు. ఏక్తా 86 వారు రెగ్యులర్ గా కలుసుకోవడానికి, కూర్చోవడానికి ఒక భవనం నిర్మించుకోవడం ఎంతో ఉపయోగకరం, హర్షించదగ్గ విషయం అన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/f1919a81-5b02-4e31-8588-a79d85da27b0-1024x683.jpg)
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్ గారు, పలువురు నాయకులు, ఏక్తా 86 సభ్యులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/6ed8588a-84d1-4f94-b430-28d945e501ce-1024x682.jpg)