Saturday, October 5, 2024
HomeతెలంగాణGudem Mahipal Reddy: కొత్త కాలనీలకు 'మిషన్ భగీరథ' మంచినీరు

Gudem Mahipal Reddy: కొత్త కాలనీలకు ‘మిషన్ భగీరథ’ మంచినీరు

ప్రతి మనిషికి సురక్షితమైన మంచినీరు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలకు సైతం రక్షిత మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలోని పిఎన్ఆర్ కాలనీలో 88 లక్షల రూపాయలతో, రామేశ్వరం బండ గ్రామ పరిధిలోని జిహెచ్ఎంసి కాలనీలో 43 లక్షల రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంకులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో అయన మాట్లాడుతూ ప్రజలు రక్షిత మంచినీరు పొందటం ప్రాథమిక హక్కు అని, ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం మిషన్ భగీరథ మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. పట్టణం నుండి పల్లె వరకు ప్రతి ఇంటికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రక్షిత మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. సురక్షితమైన నీరు తాగడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురి కావడం చాలా వరకు తగ్గుతుందని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఇప్పటికే మిషన్ భగీరథ మంచినీరు అందిస్తున్నామని, నూతన కాలనీలకు సైతం అందించేందుకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.

ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పరిపాలన అందిస్తున్నారని, వారి స్ఫూర్తితో నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ధరణి అంతిరెడ్డి, నర్సింహులు, ఎంపీటీసీ మానెమ్మ, సీనియర్ నాయకులు అంతి రెడ్డి, రామచంద్ర రెడ్డి, బండి శంకర్, గ్రామీణ నీటిపారుల శాఖ డీఈ శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News