Friday, July 5, 2024
HomeతెలంగాణGundu Sudharani met Revanth: కాంగ్రెస్ లోకి గుండు సుధారాణి?

Gundu Sudharani met Revanth: కాంగ్రెస్ లోకి గుండు సుధారాణి?

గులాబీ గూటిని వీడుతున్న ప్రముఖులు

బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు నిత్యం క్యూ కడుతున్నారు. చూస్తుంటే ఈ లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యేనాటికి బీఆర్ఎస్ ఖాళీ అయ్యేలా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బీఆర్ఎస్ నేతలంతా రేవంత్ ను కలిసి, కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. గెలిచిన వారు, ఓడిన వారన్న తేడా లేకుండా గులాబీ నేతలంతా రేవంత్ ఇంటి బాట పడుతుండటం అందరూ ముందే ఊహించిన విషయం.

- Advertisement -

ఈ లిస్టు రోజు రోజుకీ పెరుగుతోంది. కాగా తాజాగా మంత్రి పొంగులేటితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కలిశారు బీఆరెస్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి. పైకి మర్యాదపూర్వక భేటీగా చెబుతున్నా ఆమె బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరటం ఖాయంగా మారిందని గులాబీ శ్రేణులే గట్టిగా ప్రచారం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News