Thursday, July 4, 2024
HomeతెలంగాణGuvvala Balaraju: బీసీల అభ్యున్నతికి సీఎం కృషి

Guvvala Balaraju: బీసీల అభ్యున్నతికి సీఎం కృషి

300 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కులు

బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. అచ్చంపేట పట్టణంలోని శ్యామ్స్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన బీసీ, యంబిసి కులవృత్తి దారులకు 300మంది లబ్ధిదారులకు లక్షా రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీల పట్ల ఇతర పార్టీల నాయకులు చిన్నచూపు చూస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి వారికి లక్ష రూపాయలను అందించారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టి వారు ఆర్థికంగా ఎదిగేందుకు రూపాయలు 10 లక్షల అందిస్తున్నామని పేర్కొన్నారు. అదే మాదిరిగా బీసీలకు లక్ష రూపాయలను అందజేస్తామన్నారు.

- Advertisement -

అచ్చంపేట నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అచ్చంపేట ప్రాంతం పచ్చబడటానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రధాన మూలం అని పేర్కొన్నారు. ఉప్పునుంతల మండలానికి 70% శాతం, వంగూర్ మండలానికి 80%, బల్మూరు మండలానికి 30%, అచ్చంపేట మండలానికి 40% సాగునీరు అందుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ, మద్దిమడుగు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ విష్ణుమూర్తి, పట్టణ, వివిధ మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News