Saturday, October 5, 2024
HomeతెలంగాణGuvvala Balaraju: ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం కృషి

Guvvala Balaraju: ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం కృషి

ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థినిలకు పరామర్శ

ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. అమ్రాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమ్రాబాద్ మండలం మన్ననూర్ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినుల ఆరోగ్యం మెరుగుపడిందని, అందరూ కూడా కోలుకుంటున్నట్లు తెలిపారు. డాక్టర్లు అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారన్నారు.
ప్రతి ఒక్కరి క్షేమం కోసం పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు. పుడ్ పాయిజన్ కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆపదలో ఆదుకుని అండగా నిలబడితే బాగుంటుంది అని, ఆపదలో ఉన్నవారికి ఆటంకం కలిగించడం మంచిది కాదన్నారు. నియోజవర్గంలోని ప్రతి పాఠశాల, కళాశాల, వసతిగృహాలలో తన యొక్క ఫోన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News