Sunday, October 6, 2024
HomeతెలంగాణHarish Rao: సంగారెడ్డి సస్యశ్యామలం అవుతుంది

Harish Rao: సంగారెడ్డి సస్యశ్యామలం అవుతుంది

ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేతిలో ఉంటే బాగుంటుంది వేరే వాళ్ళ చేతికి పోతే తెలంగాణ ఆగం అవుతుంది

తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సాగునీటి దినోత్సవంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ కు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు , ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జౌళి శాఖ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, జిల్లా కలెక్టర్ శరత్ ,స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు హాజరయ్యారు.

- Advertisement -

మునిపల్లి (మం) చిన్న చెల్మెడ లో మంత్రి సంగమేశ్వర ఎత్తిపోతల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు మంత్రి హరీష్ రావు. 2653 కోట్ల రూపాయలతో సంగమేశ్వర ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 2 పంప్ హౌస్ లు, 12 కాల్వల నిర్మాణం ద్వారా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నసాగర్ నుంచి 12 టీఎంసీల గోదావరి జలాల తరలించనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు కామెంట్స్..

సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తయితే సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఆనాటి ఉమ్మడి పాలకులు సంగారెడ్డి జిల్లాలో సింగూరు కట్టి నీళ్లు మాత్రం హైదరాబాద్ తీసుకుపోయారు. భూములు మనవి పోయినయి.. నీళ్లు వాళ్ళు తీసుకుపోయిర్రు. ఆనాటి ప్రభుత్వాలు వ్యవసాయం దండగ అంటే కేసీఆర్ పండుగ చేసి చూపించారు. రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుంది..మద్దతు ధర ఇస్తుంది. పేదలు, రైతుల సంక్షేమమే ఎజెండాగా ప్రభుత్వం పని చేస్తుంది. సంగమేశ్వర పథకానికి భూములు ఇచ్చిన రైతులకు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం. ఎన్నికలప్పుడు చాలా మంది వస్తుంటారు, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేతిలో ఉంటే బాగుంటుంది. వేరే వాళ్ళ చేతికి పోతే తెలంగాణ ఆగం అవుతుందంటూ హరీష్ ప్రసంగం సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News