Saturday, June 7, 2025
HomeతెలంగాణHarish Rao: ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే..?: హరీశ్ రావు

Harish Rao: ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే..?: హరీశ్ రావు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరిపాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కొనసాగుతున్న కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన. పోలీసు పహారా మధ్య గ్రామ సభలు, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటరులో ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా పాలన అంటివి, సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బార్ అంటివి, ప్రతి రోజూ ప్రజలను కలుస్త అంటివి, ఏడాది కాలంగా ముఖం చాటేస్తివి.

ఇక ముఖ్యమంత్రి, మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా, సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉంది. దాన్ని కాదని మంత్రులు, అధికారులను నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నావు. ముఖ్యమంత్రి అధికార నివాసం మీ దర్పానికి సరిపోదని, జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఉంటున్నావు. మంత్రులు, అధికారులను ప్యాలెస్‌కు పిలిపించుకొని, అహంభావం ప్రదర్శిస్తున్నావు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే..?” అని హరీశ్ రావు మండిపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News