Thursday, June 12, 2025
HomeతెలంగాణHarish Rao: మరోసారి కేసీఆర్‌ను కలిసిన హరీశ్‌రావు

Harish Rao: మరోసారి కేసీఆర్‌ను కలిసిన హరీశ్‌రావు

బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌తో(KCR) మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో రెండు రోజుల క్రితమే కేసీఆర్‌ను కలిసిన హరీశ్.. ఇప్పుడు మళ్లీ కలవడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ అంశంలో తదుపరి కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

కాగా జూన్‌ 5న విచారణకు రావాలని కేసీఆర్‌కు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు కూడా నోటీసులిచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై విచారణ కోసం ప్రభుత్వం జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీశ్ రావు, జూన్ 7న ఈటల రాజేందర్ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రి, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News