Saturday, November 15, 2025
HomeతెలంగాణHigh Court: స్మితా సబర్వాల్‌కు హైకోర్టులో ఊరట.. చర్యలు వద్దన్న న్యాయస్థానం!

High Court: స్మితా సబర్వాల్‌కు హైకోర్టులో ఊరట.. చర్యలు వద్దన్న న్యాయస్థానం!

High Court gives relief to Smitha Sabharwal: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి ఆరోపణల కేసులో.. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో కేసీఆర్, హరీశ్ రావుతో పాటు మరికొందరు అధికారుల పేర్లను సైతం చేర్చారు. అందులో స్మితా సబర్వాల్ పేరును కూడా పీసీ ఘోష్ కమిషన్ ప్రస్తావించింది.

- Advertisement -

మధ్యంతర ఉత్తర్వులు జారీ:

అయితే కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ ఇటీవల స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ తనకు నోటీసులు జారీ చేసిన విధానం.. వాంగ్మూలం నమోదు చేసిన తీరును ఆమె న్యాయస్థానంలో ప్రశ్నించారు. ఈ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని స్మితా సబర్వాల్ అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా స్మితా సబర్వాల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి దీనిని కూడా విచారిస్తామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఊరట లభించినట్లు అయ్యింది.

Also Read:https://teluguprabha.net/telangana-news/ias-smita-sabharwal-challenges-pc-ghosh-commission-report-in-high-court/

కమిషన్ నివేదికలో ఏముంది?:

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తన నివేదికలో ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న పలువురు అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే స్మితా సభర్వాల్‌తో పాటు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తదితరులకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. కమిషన్ ముందు హాజరై తమ వాంగ్మూలాలను నమోదు చేసుకోవాలని సూచించింది.

ఎస్కే జోషికి ఇప్పటికే ఊరట:

ఈ వ్యవహారంలో ఇప్పటికే మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ నివేదిక ఆధారంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు ఊరట లభించినట్లయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad