Friday, September 20, 2024
HomeతెలంగాణHusnabad: కేటీఆర్ టూర్ వివరాలు ఇవిగో

Husnabad: కేటీఆర్ టూర్ వివరాలు ఇవిగో

హుస్నాబాద్ గులాబీ వర్ణాన్ని సంతరించుకుంది. ఎక్కడ చూసినా గులాబీ మయమైంది. గులాబీ సైనికులు కదం తొక్కుతున్నారు. గులాబీ సైనికుల పదఘట్టనలతో… ఉద్యమ గడ్డ, పోరు నేల మారుమోగిపోతోంది. గులాబీ సైన్యం ఉత్సాహంగా.. కదులుతోంది. ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు (శుక్రవారం) తొలిసారిగా హుస్నాబాద్ కు వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంఖు స్థాపనలు చేయడంతో పాటు బీ ఆర్ ఎస్ పార్టీ, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభకు హాజరుకానున్నారు. మొదటిసారి హుస్నాబాద్ కు వస్తున్న మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ నాయకత్వంలో గులాబీ పార్టీ శ్రేణులు సన్నద్ధం అయ్యాయి. ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపన కార్యక్రమాలవద్ద ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇప్పటికే రెండు సార్లు సంబంధిత ప్రదేశాలు సందర్శించి అధికారులు, సిబ్బందికి సూచనలు చేసారు. హుస్నాబాద్ పట్టణంలోకి బస్ డిపో వద్ద బహిరంగ సభ కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 50 వేల మంది నియోజకవర్గం నలు మూలల నుండి తరలివచ్చేందుకు, జన సమీకరణకు విస్తృత ఏర్పాట్లు చేసారు. కేటీఆర్ తో పాటు పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సభకు, ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలకు హాజరుకానున్నారు. సభకు, మంత్రుల పర్యటనలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్బంగా ఎసిపి వాసాల సతీష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. బీ అర్ ఎస్ పార్టీ బహిరంగ సభను పురస్కరించుకుని హుస్నాబాద్ గులాబీ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీ లతో గులాబీ మయమైంది. సభ వద్ద ప్రత్యేకంగా గులాబీ వాలంటీర్లను నియమించారు. కేటీఆర్ పర్యటన సందర్బంగా టూరిజం బస్సును కూడా అధికారులు అందుబాటులో ఉంచారు. సతీష్ కుమార్ తనయుడు యువనేత ఇంద్రనీల్ వొడితల గురువారం హుస్నాబాద్ పట్టణంలో పర్యటించి యూత్, విద్యార్ధి నాయకుల్లో ఉత్సాహం నింపారు. కేటీఆర్ సభా స్థలి వద్ద ఏర్పాట్లు పర్యవేక్షించారు. 2018 లో ఎన్నికల సందర్బంగా కేసీఆర్ సభ హుస్నాబాద్ లో జరిగింది. తదనంతరం ఇంత పెద్ద ఎత్తున సభ జరుగుతుండడం గమనార్హం. హుస్నాబాద్ గులాబీ కి కోటలా మారింది. అన్ని ఎన్నికల్లోనూ ప్రభావాన్ని చూపుతోంది. ఎమ్మెల్యే సతీష్ కుమార్ మొదటిసారి 2014 లో 34 వేల ఓట్ల మెజారిటీతో రెండోసారి 70 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగరేశారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు తనయుడైన సతీష్ కుమార్ ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారు. ఇక్కడి రైతాంగానికి ఎంతో ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టు కూడా ఎన్నో సమస్యలు అధిగమించి దాదాపుగా పూర్తయింది. గోదావరి జలాలు నియోజకవర్గానికి తీసుకువచ్చారనే పేరు సతీష్ కుమార్ కు ఉంది. సతీష్ కుమార్ కు వివాదరహితుడనే పేరుంది. నియోజకవర్గంలో వేరే ఏ పార్టీకి లేని బలమైన క్యాడర్ గులాబీ పార్టీకి ఉంది. నియోజకవర్గంలో లక్షకు పైగా వివిధ పథకాల లబ్ధిదారులు ఉన్నారు. సి ఎం కేసీఆర్ 2018 సెప్టెంబర్ లో ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత మొదటి ఎన్నికల ప్రచార సభ ప్రజా ఆశీర్వాద సభ పేరుతో హుస్నాబాద్ లోనే న నిర్వహించడం గమనార్హం. హుస్నాబాద్ తో సి ఎం కేసీఆర్ కు ప్రత్యేక సెంటిమెంట్ ఉంది. హుస్నాబాద్ లో జరుగుతున్న కేటీఆర్ సభ ద్వారా ప్రజలకు బలమైన సంకేతాలు ఇవ్వాలని ఇక్కడి గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏదిఏమైనా కేటీఆర్ సభ నేపథ్యంలో గులాబీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నెలకొంది. పోరుగడ్డ, ఉద్యమ కేంద్రం హుస్నాబాద్ లో బహిరంగ సభ సక్సెస్ చేసేందుకు పెద్ద ఎత్తున గులాబీ సైనికులు పనిచేస్తున్నారు.

- Advertisement -

మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలు

ఉదయం 10-00 గంటలకు మంత్రి కేటీఆర్ హెలికాఫ్టర్ ద్వారా హైదరాబాద్ నుండి నేరుగా స్థానిక ఇండోర్ స్టేడియం వద్దకు చేరుకుంటారు.

10-30 గంటలకు: రూ. కోటి వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియం కు ప్రారంభోత్సవం చేసారు. అలాగే రూ. 2.25 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. తర్వాత రూ. కోటి వ్యయంతో నిర్మించిన ఎస్టీ బాలికల హాస్టల్ ను ప్రారంభిస్తారు. రూ. 16 కోట్ల 46 లక్షల వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ప్రారంభోత్సవం చేస్తారు

ఉదయం 11-00 గంటలకు : రూ. రెండుకోట్ల వ్యయంతో నిర్మించిన ఉపాధ్యాయ శిక్షణ భవనాన్ని ప్రారంభిస్తారు. తదనంతరం రూ. 10లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను గోడంగడ్డలో ప్రారంభిస్తారు.

ఉదయం 11-15 గంటలకు: రూ. కోటి ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు

ఉదయం 11-20 గంటలకు: రూ. 3 కోట్ల 50 లక్షలతో ఎల్లమ్మ చెరువు వద్ద టూరిజం శాఖ ఆధ్వర్యంలో సుందరీకరణ పనులకు భూమిపూజ చేస్తారు.

ఉదయం 11-30 గంటలకు: బస్ డిపో వద్ద జరిగే బహిరంగ కు హాజరవుతారు

మధ్యాహ్నం 01-30 గంటలకు: సెయింట్ జోసెఫ్ పాఠశాలలో లంచ్ చేస్తారు.

అనంతరం 2-30 గంటలకు హనుమకొండకు హెలికాఫ్టర్ ద్వారా వెళ్తారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News