Saturday, October 5, 2024
HomeతెలంగాణHusnabad: కారు దిగిన భీమదేవరపల్లి సర్పంచ్

Husnabad: కారు దిగిన భీమదేవరపల్లి సర్పంచ్

ఆందోళనలో బిఆర్ఎస్ క్యాడర్

భీమదేవరపల్లి సర్పంచ్ సాతూరి స్వాతి హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సమక్షంలో వార్డు మెంబర్లతో సహా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొన్నం వారికి పార్టీ కండువా కప్పి, కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భీమదేవరపల్లి సర్పంచ్ స్వాతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ముందు చూపు చూపిస్తున్నారని పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై విశ్వాసంతో ఉన్నారని అన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకొని బిఆర్ఎస్ కుటుంబ పాలనను అంతం చేస్తామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.. ఇందులో వార్డు సభ్యులు తాళ్ళ పెళ్లి భిక్షపతి, పోలు అశోక్, నాయకులు తాళ్ళ పల్లి సదానందం, మార్పాటి శ్రీనివాస్ రెడ్డి, చందరాజు శంకర్, గౌడ సంఘం అధ్యక్షులు మాచర్ల కుమార స్వామి, మాచర్ల సదానందం, శాగంటి వేంకటేశ్వర్లుతో పాటుగా పలువురు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News