Friday, September 20, 2024
HomeతెలంగాణHuzurnagar: హుజూర్నగర్ అభివృద్ధిలో ముందంజ

Huzurnagar: హుజూర్నగర్ అభివృద్ధిలో ముందంజ

నేరేడుచర్ల పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా నాగండ్ల శ్రీధర్ ప్రమాణ స్వీకారం చేశారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు, అంతకుముందు బిఆర్ఎస్ పట్టణ కార్యాలయం నుండి మార్కెట్ యార్డ్ వరకు కోలాటాలతో, బాణసంచా కాల్చి,భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి లింగయ్య యాదవ్, మాట్లాడుతూ.. హుజూర్నగర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుండి సైదిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే అభివృద్ధి చెందిందని అన్నారు,ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రారంభించారన్నారు. హుజూర్నగర్ అభివృద్ధిలో ముందంజలో ఉన్నదని తెలిపారు, అనంతరం నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన మార్కెట్ చైర్మన్ ను కమిటీ సభ్యులను అభినందించారు,

- Advertisement -

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

నేరేడుచర్ల ఉన్నత పాఠశాలలో 99.లక్షల 55 వేల రూపాయలతో పాఠశాల మౌలిక వసతుల బలోపిత పనుల శంకుస్థాపన చేశారు,మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు,ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు,ఎంపీపీ లకుమల్ల జ్యోతి,జడ్పిటిసి రాపోలు నరసయ్య,వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి,డిసీసీబి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి,వైస్ ఎంపీపీ తాళ్లూరు లక్ష్మీనారాయణ,ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News