Sunday, July 7, 2024
HomeతెలంగాణHyd: అనన్య పోల్సాని కూచిపూడి రంగప్రవేశం

Hyd: అనన్య పోల్సాని కూచిపూడి రంగప్రవేశం

సీఎం కేసీఆర్ బంధు వర్గానికి చెందిన అనన్య పోల్సాని

అనన్య పోల్సాని కూచిపూడి రంగప్రవేశం అత్యంత ఘనంగా హైదరాబాద్ లో సాగింది. రవీంద్రభారతిలో అనన్య పోల్సాని కూచిపూడి మొదటి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయగా, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఈ ఆరంగేట్రం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ మేనకోడలు అనన్య పోల్సాని. అనన్య పోల్సాని తల్లిదండ్రులు శ్రీనివాస్ రావు, సౌమ్య, గ్రాండ్ పేరెంట్స్ వెంకట్ రామారావు & భారతి, రవీందర్ రావు & శశికళ. ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ దీపికా రెడ్డి వద్ద అనన్య కూచిపూడి విద్యను అభ్యసిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి సీఎం కెసిఆర్ సతీమణి శ్రీమతి శోభమ్మ, కుమార్తె కవిత కుటుంబం, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎంపీ సంతోష్ కుమార్ దంపతులు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సంగీత నాటక అకాడమి చైర్మన్ దీపికా రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News